Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్లు జైలులో లఖ్వీ.. తండ్రి అయ్యాడంటేనే..!: అసదుద్దీన్ ఓవైసీ

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (21:46 IST)
ముంబై ముష్కరదాడి నిందితుడు లఖ్వీకి పాకిస్థాన్ కోర్టు బెయిల్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో లఖ్వీకి బెయిల్ ఇవ్వడాన్ని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దుయ్యబట్టారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, మూడేళ్లుగా జైల్లో ఉంటూనే లఖ్వీ తండ్రయ్యాడంటే పాకిస్థాన్ లోని జైళ్ల నిర్వహణ తీరుతెన్నులను అర్థం చేసుకోవచ్చని అన్నారు. 
 
పాకిస్థాన్ హైకమీషనర్‌ను తక్షణం రప్పించుకుని గట్టిగా హెచ్చరించాలని అసదుద్దీన్ పేర్కొన్నారు. పాకిస్థాన్ తీరుతెన్నులను అందరూ గమనిస్తున్నారని తెలుసుకోవాలని ఆయన సూచించారు.
 
ఇదిలా ఉండగా, పెషావర్‌లో జరిగిన దారుణ మారణకాండతో పాక్ ప్రభుత్వం కళ్లు తెరిచింది. దీంతో ఉరిశిక్ష పడ్డ ఖైదీలను ఉరి తీసేందుకు రంగం సిద్ధం చేసింది. ఆరుగురు తీవ్రవాదులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు ఆర్మీ చీఫ్ రహీల్ క్లియరెన్స్ ఇవ్వడంతో వారిని ఏ క్షణంలో అయినా ఉరి తీసే అవకాశముంది.
 
కాగా, ఆరుగుర్నీ ఒకేసారి ఉరి తీసేకంటే ముందుగా ఇద్దర్ని ఉరి తీయాలని పాకిస్థాన్ ప్రభుత్వం భావిస్తోంది. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ పై దాడికి యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను ముందుగా ఉరితీసే అవకాశం ఉంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments