Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే రెండు రోజుల పాటు దేశంలో వర్షాలు...

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (09:42 IST)
దేశవ్యాప్తంగా వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గత మూడు నాలుగు రోజులుగా వాతావారణంలో సంభవించిన మార్పుల కారణంగా మరో రెండు రోజుల పాటు తీవ్ర చలిగాలులు వీస్తాయని, అలాగే వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భారీ వర్షాలు, హిమపాతానికి అవకాశం ఉందని, అందువల్ల ప్రజలతో పాటు.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 
 
ఈ నెల 29, 31వ తేదీల్లో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని లఢక్, గిల్గిత్, బాలిస్థాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో వర్షాలతో పాటు భారీ హిమపాతానికి అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వచ్చే 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు పశ్చిమ హిమాలయ ప్రాంతంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని వివరించారు. తూర్పు భారతదేశంలో 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల రోజంతా చల్లగానే ఉంటుందని ఐఎండీ తెలిపింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments