Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 14... కేజ్రీకి స్పెషల్‌... అదేంటో తెలుసా?

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (10:53 IST)
ప్రజాసంక్షేమం.. సంరక్షణ.. సంస్కారం! 'మినీ భారత్'లో సామాన్యుడి అసాధారణ విజయానికి కారణాలివే! ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్‌ విజయం సాధించింది. అరవింద్‌ కేజ్రీవాల్‌ ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆయనకు ఓట్లు రాల్చాయి! మహిళలు, ఢిల్లీ ప్రజల సంరక్షణకు ఆయన తీసుకున్న నిర్ణయాలు మరోసారి విజయాన్ని అందించాయి! ముఖ్యమంత్రిగానే కాదు.. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన చూపిన సంస్కారం విజయ తీరాలకు చేర్చింది. వెరసి, కేజ్రీవాల్‌ మేజిక్‌ మరోసారి పనిచేసింది. 
 
బీజేపీ విభజన రాజకీయాల ఉచ్చులో పడకపోవడం.. జాతీయత విషయంలో రాజీలేదని స్పష్టం చేయడం.. ఐదేళ్లు అధికారంలో కొనసాగినా అవినీతి మరక పడకపోవడం.. ఉచిత పథకాలు ఆప్‌ గెలుపును నల్లేరుపై బండి నడక చేసేశాయి. దీనికితోడు, ముస్లిములంతా ఏకం కావడంతో ఢిల్లీని ఆప్‌ తమ ఎన్నికల గుర్తు చీపురుతో ఊడ్చేసింది. దీంతో ఆప్ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఫలితంగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ మరోమారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదీకూడా తనకు అచ్చొచ్చిన ప్రేమికుల రోజున సీఎం కుర్చీలో కూర్చోనున్నారు. 
 
అయితే, ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14వ తేదీన కేజ్రీవాల్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. 2012 నవంబరులో 'ఆప్'ని స్థాపించారు. ఆప్‌ తొలిసారిగా 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. హంగ్‌ అసెంబ్లీ ఏర్పడడంతో కాంగ్రెస్ పార్టీతో ఆప్‌ చేతులు కలిపి అధికారంలోకి వచ్చింది. కొన్నాళ్లకే ఇరు పార్టీలు కత్తులు దూసుకోవడం మొదలుపెట్టాయి. ఫలితంగా 2014 ఫిబ్రవరి 14న సీఎం పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేశారు. 
 
2015 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఆప్‌ 67 స్థానాలు గెలిచింది. ఫిబ్రవరి 14వ తేదీన రామ్‌లీలా మైదానంలో కేజ్రీవాల్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒ యేడాది తర్వాత సరిగ్గా అదే రోజు ఆయన ఓ ట్వీట్‌ చేశారు. 'గత ఏడాది ఇదే రోజు ఢిల్లీ ఆప్‌తో ప్రేమలో పడింది. ఈ బంధం దృఢమైనది. చిరకాలం నిలిచేది' అని రాశారు. ఇప్పుడు కూడా ప్రమాణ స్వీకారానికి ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14వ తేదీనే కేజ్రీవాల్‌ ఎంచుకోనున్నారని సమాచారం. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments