Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుణ్ జైట్లీకి అస్వస్థత... ఎయిమ్స్‌లో కిడ్నీలకు చికిత్స

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరిలించారు. ఈ ఆస్పత్రిలో ఆయనకు కిడ్నీలకు ఆపరేషన్ చేయనున్నారు. అన్నీ అనుకూలిస్తే శనివారమే రోజే ఆయ

Webdunia
శనివారం, 7 ఏప్రియల్ 2018 (13:38 IST)
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరిలించారు. ఈ ఆస్పత్రిలో ఆయనకు కిడ్నీలకు ఆపరేషన్ చేయనున్నారు. అన్నీ అనుకూలిస్తే శనివారమే రోజే ఆయనకు మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స జరగనుంది. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా ఆయన తన అధికారిక విధులకు దూరంగా ఉంటున్నారు. వైద్యుల సూచన మేరకు ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ కేవలం ముఖ్యమైన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఉందని వైద్యులు హెచ్చరించడంతో ఇంటికే పరిమితం అయ్యారు. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఆయన్ను చికిత్స కోసం ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. శనివారం శస్త్రచికిత్స నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. అపోలో హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ సందీప్ గులేరియా ఆధ్వర్యంలో వైద్య బృందం శస్త్రచికిత్స నిర్వహించనుంది. సందీప్ గులేరియా ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా సోదరుడు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments