Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో భారీ దొంగతనం: ముతూట్ ఫైనాన్స్ నుంచి రూ. 7 కోట్ల విలువ చేసే బంగారం చోరీ

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (17:45 IST)
తమిళనాడులో భారీ దొంగతనం జరిగింది. క్రిష్ణగిరి జిల్లా హోసూర్​-బగలూరు రోడ్డు వద్ద ఉన్న ముతూట్​ ఫైనాన్స్​ బ్రాంచ్​లోకి చొరబడ్డ దుండగులు.. పెద్ద మొత్తంలో బంగారం ఎత్తుకెళ్లారు. దీని విలువ సుమారు రూ.7 కోట్లకుపైనే ఉంటుందని తెలుస్తోంది.
 
రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం బ్రాంచ్​ను తెరిచారు సిబ్బంది. కాసేపటికే కస్టమర్ల రూపంలో లోపలికి ప్రవేశించారు దుండగులు. ఆ సమయంలో నలుగురు ఉద్యోగులు మాత్రమే ఉండగా.. వారిని గన్​తో బెదిరించి కట్టేశారు. అనంతరం లాకర్​ తాళం తీసుకుని.. సుమారు 25కేజీలకు పైగా బంగారాన్ని, రూ. 90 వేల నగదును ఎత్తుకెళ్లారు. 
 
ఇతర ఉద్యోగులు, సిబ్బంది ఆఫీసుకు వచ్చాక అసలు విషయం బయటపడింది. కట్టేసి ఉన్న నలుగురిని విడిపించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు.. దర్యాప్తు చేస్తున్నారు. బంగారు ఆభరణాల విలువే రూ. 7 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం వారికోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments