Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌కు ఎలా బుద్ధి చెపుదాం? మీరే చెప్పండి.. త్రివిధ దళాధిపతులతో మోడీ కీలక భేటీ

పాకిస్థాన్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యూరీలోని ఆర్మీ క్యాంపుపై ముష్కర మూకలతో దాడి చేయించిన పాకిస్థాన్‌కు తగిన గుణపాఠ

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (14:40 IST)
పాకిస్థాన్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యూరీలోని ఆర్మీ క్యాంపుపై ముష్కర మూకలతో దాడి చేయించిన పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పేలా ఆయన వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులోభాగంగా శనివారం త్రివిధ దళాధిపతులతో అత్యంత కీలక సమావేశం నిర్వహించారు. 
 
ఈ భేటీలో ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్, ఎయిర్ చీఫ్‌ మార్షల్ అరూప్ రాహ, నౌకదళం ఉప అధిపతి వైస్ అడ్మిరల్ కేబీ సింగ్‌లతో ప్రత్యేకంగా సమావేశమై, వారందరి సలహాలనూ అడిగి తీసుకున్నారు. పాకిస్థాన్‌కు బుద్ధి ఎలా చెప్పాలో మీరే చెప్పండి అంటూ మోడీ అడిగినట్టు తెలుస్తోంది. 
 
కాగా, ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా హాజరయ్యారు. సైనిక స్థావరంపై ఉగ్రదాడి తర్వాత ప్రధాని పలుమార్లు ఉన్నతాధికారులతో, కేంద్రమంత్రులతో వార్ రూమ్ సమావేశాలు జరుపుతున్న విషయం తెల్సిందే. కాగా, నౌకాదళం చీఫ్ సునీల్ లాంబా అందుబాటులో లేకపోయినందున కేబీ సింగ్ ఈ సమావేశానికి వచ్చారని అధికారులు తెలిపారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments