Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి గుడ్‌బై చెప్పిన అబ్దుల్ కలాం మేనల్లుడు.. ఎందుకంటే?

Webdunia
సోమవారం, 23 నవంబరు 2015 (17:10 IST)
భారతీయ జనతా పార్టీకి మాజీ రాష్ట్రపతి, భారత అణుశాస్త్ర పితామహుడు దివంగత అబ్దుల్ కలాం మేనల్లుడు సయీద్ ఇబ్రహీం గుడ్‌బై చెప్పారు. ఇటీవలే ఆ పార్టీలో చేరిన ఆయన.. అంతే త్వరగానే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. 
 
అబ్దుల్ కలాం జీవించి ఉన్నంత వరకు ఆయనకు ఢిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఓ ఇంటిని కేంద్రం కేటాయించింది. కలాం మరణానంతరం ఈ ఇంటిని స్మారక భవనంగా మార్చాలని మాజీ రాష్ట్రపతి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కానీ, కేంద్రం ఇవేమీ పట్టించుకోకుండా, కేంద్ర మంత్రి మహేష్ శర్మకు నివాసముండేందుకు కేటాయించింది. 
 
ఈ చర్యకు నిరసనగా ఆ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు సయీద్ ఇబ్రహీం ప్రకటించారు. ఢిల్లీలో కలాం ఉన్న భవనాన్ని ఆయన గుర్తుగా స్మారకభవనంగా మార్చకుండా కేంద్ర ప్రభుత్వం దానిని ఓ కేంద్ర మంత్రికి కేటాయించడంపై తమను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందన్నారు. ఇప్పటికైనా భవనాన్ని కలాం గుర్తుగా జాతీయ విజ్ఞాన కేంద్రంగా మార్చాలని సయీద్‌ కోరారు. కానీ దానిని కేంద్ర మంత్రికి కేటాయించడంపై ఆయన అసంతృప్తితో పార్టీ నుంచి వైదొలిగారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments