యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ (యూపీఎస్సీ) 2022 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మొత్తం 933 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. యూపీఎస్స్సీ విడుదల చేసిన ఫలితాల్లో ఇషితా కిషోర్ టాపర్గా నిలిచింది. గరిమా లోహియా రెండో స్థానం, ఉమా హాథిన్ మూడో స్థానంలో నిలిచారు. ఇక ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు.
ఈ ఫలితాల్లో మహిళలు చరిత్ర సృష్టించారు. తొలి నాలుగు ర్యాంకులు మహిళలే సాధించడం విశేషం. తొలి ర్యాంక్ను ఇషిత కిషోర్ సాధించగా, రెండో ర్యాంక్ను గరిమా లోహియా, మూడో ర్యాంక్ను ఉమా హారతి, నాలుగో ర్యాంక్ను స్మృతి మిశ్రా సాధించారు.