జేఎన్‌యూలో మరోసారి ఉద్రిక్తత: విద్యార్ధులను అడ్డుకున్న పోలీసులు, అరెస్టులు

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (08:26 IST)
ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో గురువారం రాత్రి మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేఎన్‌యూ వీసీని తొలగించాలంటూ విద్యార్ధులు రాష్ట్రపతి భవన్‌ వైపు దూసుకురావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా శాస్త్రిభవన్‌ వద్ద పోలీసులు, విద్యార్ధులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
 
కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జేఎన్‌యూ ఘటనపై విచారణకు వైస్ ఛాన్సలర్ ఎం.జగదీశ్ కుమార్ ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఐదుగురు ప్రొఫెసర్లు సుశాంత్ మిశ్రా, మజహర్ ఆసిఫ్, సుధీర్ ప్రతాప్ సింగ్, సంతోష్ శుక్లా, భస్వతీ దాస్ సభ్యులుగా ఉన్నారు. ఇందుకు సంబంధించి జేఎన్‌యూ రిజిస్ట్రార్ డా. ప్రమోద్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
 
జనవరి 5 ఆదివారం సాయంత్రం జేఎన్‌యూలోకి ముసుగులతో ప్రవేశించిన సుమారు 50 మంది గుర్తు తెలియని వ్యక్తులు కర్రలు, ఇనుపరాడ్లతో విద్యార్ధులు, అధ్యాపకులపై దాడికి పాల్పడి పాల్పడ్డారు. ఈ ఘటనలో విద్యార్ధి సంఘం నేత అయిషే ఘోష్ తీవ్రంగా గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments