తమిళనాడులో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (18:14 IST)
తమిళనాడు రాష్ట్రంలో విద్యార్థినిల వరుస ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. గత రెండు వారాల్లో ముగ్గురు విద్యార్థినిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ వరుస ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. 
 
ఇటీవల కళ్లకుర్చి జిల్లా చిన్నసేలంలో శ్రీమతి అనే ప్లస్ టూ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తాజాగా తిరువళ్ళూరు జిల్లాలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం జరిగింది. 
 
ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలకు చెందిన హాస్టల్‌లో ఉంటూ విద్యాభ్యాసం చేస్తూ వచ్చిన 17 యేళ్ల సరళ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమచారం అందుకున్న మప్పేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసును సీబీసీఐడీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
మరోవైపు, ఈ వరుస ఆత్మహత్య ఘటనలపై ముఖ్యమంత్రి ఎంకేస్టాలిన్ స్పందించారు. విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడాలనే ఆలోచనను విడనాడాలని ఆయన కోరారు. కష్టాలను విజయాలుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థినులపై లైంగిక, మానసిక, శారీరక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం