మమత మరో షాక్‌...! ఏంటో తెలుసా?

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (12:09 IST)
పశ్చిమ బెంగాల్‌లో మమతా సర్కార్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అసమ్మతి నేతలు ఒక్కొక్కరిగా తృణమూల్‌కు వీడ్కోలు పలుతుకున్నారు.

ఇటీవల నలుగురు నేతలు తృణమూల్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేయగా...తాజాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన కేబినేట్‌ సమావేశానికి నలుగురు మంత్రులు డుమ్మా కొట్టారు. కాగా, వీరిలో ముగ్గురు సమావేశానికి ఎందుకు రాలేదో సరైన వివరణ ఇచ్చినట్లు పార్టీ జనరల్‌ కార్యదర్శి పార్థా చటర్జీ తెలిపారు.

ఉత్తర బెంగాల్‌ అభివృద్ధి శాఖ మంత్రి రవీంద్ర ఘోష్‌..ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదలుపెట్టిన ఓ ప్రచార పర్యవేక్షణలో బిజీగా ఉన్నానని చెప్పగా..పర్యాటక శాఖ మంత్రి గౌతమ్‌ దేవ్‌ ఆరోగ్యం బాగోలేదని తెలిపారు. మత్య్సశాఖ మంత్రి చంద్రనాథ్‌ సిన్హా ..వచ్చే వారం ముఖ్యమంత్రి పర్యటన బాధ్యతలు చూస్తున్నట్లు వివరణ ఇచ్చారు.

కాగా, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి రజీబ్‌ బెనర్జీ ఎటువంటి వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది. దోమ్‌జూర్‌ ఎమ్మెల్యే రజీబ్‌ కూడా కొన్ని రోజులుగా పార్టీపై అసంతృప్తితో  ఉన్నారు. నవంబర్‌లో జరిగిన ఓ బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ పార్టీలో నెపోటిజం (వారసత్వం) ఉందని తన అసమ్మతిని తెలియజేశారు.

వారసత్వానికి పెద్దపీట వేయడంతో తాను నిరాశ చెందినట్లు ఆరోపించారు. కాగా, ఇటీవల తృణమూల్‌ను వీడి బిజెపిలో చేరిన సువేందు అధికారి కూడా పార్టీపై ఇటువంటి విమర్శలే చేసిన సంగతి విదితమే. తాజాగా అటవీ శాఖ మంత్రి రజీబ్‌ కూడా సువేందు వ్యాఖ్యలను పునరుద్ఘాటించడంతో.. పార్టీ జనరల్‌ కార్యదర్శి పార్థా చటర్జీ నుండి పిలుపు వచ్చింది.

సమావేశానంతరం రాజీకి వచ్చినట్లే కనిపించనప్పటికీ...తాజాగా జరిగిన సమావేశానికి డుమ్మా కొట్టడంతో పలు అనుమానాలకు తావునిచ్చినట్లైంది. ఈ ఫిరాయింపుల పరంపర ఇంకా కొనసాగవచ్చునన్న అనుమానాలకు తావునిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments