Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాన్పు చేశారు.. కాటన్ మరిచారు.. సీఎంసీ వైద్యుల నిర్లక్ష్యం

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (11:37 IST)
కాన్పు కోసం వెళితే సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసిన వైద్యులు కుట్లు వేసే క్రమంలో దూది (కాటన్)ని మహిళ కడుపులోనే మరిచి కుట్లు వేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని రాయవేలూరులో ఉన్న క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో జరిగింది. 
 
బాధితులు ఏపీలోని నెల్లూరు జిల్లా వాసులు. వైద్యులు చేసిన తప్పును ఆలస్యంగా గుర్తించిన బాధితులు నష్టపరిహారం కోరుతూ నెల్లూరు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్‌ను ఆశ్రయించింది. రోగికి 15 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గత 2015లో నెల్లూరు జిల్లా ఏఎస్.పేటకు చెందిన ఫాతీం భార్య రశీలబాను కాన్పుకోసం వేలూరులోని సీఎంసీ ఆస్పత్రిలో చేరింది. నవంబరు 27వ తేదీన సిజేరియన్ ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. డిసెంబరు 3వ తేదీన ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 
 
ఇంటికి వెళ్లిన తర్వాత ఆమెకు కడుపు నొప్పి మొదలైంది. ఈ నొప్పి తీవ్రతరం కావడంతో సుమారు రెండేళ్లపాటు హైదరాబాద్, విజయవాడ, వేలూరుల్లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు.

అయినప్పటికీ నొప్పికి ఉపశమనం లభించలేదు. ఈ క్రమంలో 2017 జూన్ 17వ తేదీన నెల్లూరులోని కిమ్స్ ఆస్పత్రిలో చేరగా, వారు స్కాన్, ఇతర వైద్య పరీక్షలు చేసి కడుపులో కాటన్ ఉన్నట్టు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments