Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ క్యాంటీన్ బోర్డులను తొలగించారు.. డీఎంకే కార్యకర్తలపై వేటు

Webdunia
బుధవారం, 5 మే 2021 (10:03 IST)
డీఎంకే పార్టీ కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీ అన్నాడీఎంకే దివంగత నేత, మాజీ సీఎం జయలలిత ఫొటోతో ఉన్న క్యాంటీన్ల బోర్డులను తొలగించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్‌ అయ్యాయి. అది కాస్తా డీఎంకే అధినేత స్టాలిన్ దృష్టికి వెళ్లింది. వెంటనే వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని ఆయన ఆదేశించారు. 
 
చెన్నై మాజీ మేయర్‌ సుబ్రమణియన్‌ను స్టాలిన్‌ ఆదేశించారు. పార్టీ కార్యకర్తలపై సుబ్రమణియన్‌ చర్యలు తీసుకున్నారు. క్యాంటీన్‌ బోర్డులను తిరిగి వాటి స్థానంలో ఏర్పాటు చేశామన్నారు.
 
దీంతో సొంత పార్టీ కార్యకర్తలపైనే డీఎంకే వేటు వేసింది. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నైలోని చెన్నైలో అమ్మ క్యాంటీన్‌ బోర్డులు తొలగించినందుకు వారిపై డీఎంకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఘన విజయం సాధించింది. దాంతో కొందరు డీఎంకే పార్టీ కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీ అన్నాడీఎంకే దివంగత నేత, మాజీ సీఎం జయలలిత ఫొటోతో ఉన్న క్యాంటీన్ల బోర్డులను తొలగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments