Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన అమిత్ షా : ఆ సమస్యతో...

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (10:52 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోమారు ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. ఇటీవలే కరోనా వైరస్ బారినపడి కోలుకుని త్వరలోనే ఇంటికి డిశ్చార్జ్ కావాల్సివుంది. ఇంతలోనే ఆయన ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. దీనికి కారణంగా ఆయన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. 
 
కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన తర్వాత అమిత్ షా గుర్గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో రెండు వారాలుగా చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో నెగెటివ్ అని వచ్చింది. ఇటీవలే 'తనకు నెగెటివ్‌ వచ్చిందని, ఈశ్వరుడిని కృతజ్ఞతలు' తెలుపుతున్నానని అమిత్ షా ప్రకటన కూడా చేశారు. 
 
అయినప్పటికీ, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేవరకు మేదాంత ఆసుపత్రిలోనే చికిత్స తీసుకోవాలని అనుకున్నారు. అయితే, ఆయన మేదాంత ఆసుపత్రిలో శ్వాసకోశ సమస్యతో పాటు చెస్ట్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుండటంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను అక్కడి నుంచి సోమవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌‌కు తరలించారు. ఎయిమ్స్‌లోనే ఇకపై ఆయన చికిత్స తీసుకోనున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలువురు ప్రముఖులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments