Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైకు గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు ఇప్పట్లో రారట...

తమిళనాడు రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు ముంబైలోనే ఉన్నారు. ఈయనకు ఇప్పట్లో చెన్నైకు వచ్చే ఆలోచన లేదట. దీని వెనుక కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉండటమేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నా

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (16:25 IST)
తమిళనాడు రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు ముంబైలోనే ఉన్నారు. ఈయనకు ఇప్పట్లో చెన్నైకు వచ్చే ఆలోచన లేదట. దీని వెనుక కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉండటమేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  
 
మహరాష్ట్ర గవర్నర్ అయిన ఆయన తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్‌గా ఉన్నారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం స్థానంలో జయలలిత నెచ్చెలి వీకే శశికళను ఎన్నుకుంటూ ఏఐఏడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అదే రోజు ఢిల్లీ వెళ్లిన గవర్నర్ అక్కడి నుంచి నేరుగా ముంబైకి చేరుకున్నారు. శశికళ ప్రమాణ స్వీకారం గవర్నర్ చేతిలో ఉండటంతో ఆయన ఎప్పుడు చెన్నై వస్తారా ఎదురు చూస్తుండగా.. గవర్నర్ మాత్రం బుధవారం తమిళనాడు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. 
 
కనీసం గురువారం వరకు ఆయన ముంబైలోనే ఉండేందుకు ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం గవర్నర్ ముంబైలోనే ఉన్నారనీ... బుధవారం సాయంత్రం 5 గంటలకు ఓ కెమికల్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారని రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి. 
 
చెన్నై ఎప్పుడు వస్తారన్న దానిపై బుధవారం సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మంగళవారం ప్రస్తుత ముఖ్యమంతి శశికళపై తిరుగుబావుటా ఎగురవేయడంతో చెన్నైలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడిక్కిన సంగతి తెలిసిందే. దీంతో గవర్నర్ శశికళ ప్రమాణ స్వీకారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments