Webdunia - Bharat's app for daily news and videos

Install App

Karnataka: గుండెపోటుతో మరణాలు కోవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధం లేదు.. కేంద్రం

సెల్వి
బుధవారం, 2 జులై 2025 (13:05 IST)
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గుండె సంబంధిత మరణాలను కోవిడ్ వ్యాక్సిన్‌తో ముడిపెట్టిన నేపథ్యంలో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఐసీఎంఆర్, ఎయిమ్స్ చేసిన పరీక్షలో కరోనా వైరస్ వ్యాక్సిన్‌లకు ఆకస్మిక మరణాలకు మధ్య ఎటువంటి సంబంధంలేదని నిర్ధారించడం జరిగిందని కేంద్రం తెలిపింది. 
 
ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్‌ను "తొందరగా ఆమోదించడం, పంపిణీ చేయడం" కూడా ఈ మరణాలకు ఒక కారణం కావచ్చు అని సిద్ధరామయ్య మంగళవారం అన్నారు. ఛాతీ నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే, ప్రతి ఒక్కరూ వెంటనే చెక్-అప్ కోసం సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని, ఈ సంకేతాలను విస్మరించవద్దని ఆయన కోరారు. 
 
అయితే దేశంలోని అనేక ఏజెన్సీల ద్వారా ఆకస్మిక మరణాల విషయాన్ని పరిశోధించామని, ఈ అధ్యయనాలు COVID-19 టీకా, ఆకస్మిక మరణాల నివేదికల మధ్య ప్రత్యక్ష సంబంధం లేదని నిర్ధారించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) అధ్యయనాలు భారతదేశంలో COVID-19 టీకాలు సురక్షితమైనవి, ప్రభావవంతమైనవని, తీవ్రమైన దుష్ప్రభావాల ఏర్పడటం చాలా అరుదని ధృవీకరిస్తున్నాయి. 
 
జన్యుశాస్త్రం, జీవనశైలి, ముందుగా ఉన్న పరిస్థితులు, కోవిడ్-19 అనంతర సమస్యలతో సహా అనేక రకాల కారణాల వల్ల ఆకస్మిక గుండె మరణాలు సంభవించవచ్చని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Komali Prasad: అవాస్తవాల్ని నమ్మకండి అసత్యాల్ని ప్రచారం చేయకండి - కోమలి ప్రసాద్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments