Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు జాలర్ల వలలో రూ.50 కోట్ల విలువ చేసే అంబర్ గ్రీస్

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (09:08 IST)
తమిళనాడు జాలర్లకు జాక్‌పాట్ తగిలింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన కొందరు జాలర్ల చేపల వలలో రూ.50 కోట్ల విలువ చేసే అంబర్ గ్రీస్ (తిమింగలం వాంతి) చిక్కంది. దీన్ని అచ్చెరపాక్కం అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. 
 
అటవీ అధికారుల కథనం మేరకు... చెంగల్పట్టు జిల్లా కల్పాక్కం సమీప కడపాక్కం గ్రామానికి చెందిన ఇంద్రకుమార్‌, మాయకృష్ణన్‌, కర్ణన్‌, శేఖర్‌ చేపల వేట కోసం శనివారం సముద్రంలోకి వెళ్లారు. 
 
వారు విసిరిన వలల్లో 38.6 కిలోల అంబర్‌ గ్రిస్‌ చిక్కింది. జాలర్లు ఈ విషయాన్ని అచ్చిరుపాక్కం అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. 
 
కాగా, ఈ అంబర్ గ్రీస్‌ను సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు. ఫలితంగా మార్కెట్‌లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. తిమింగలాల కడుపులో తయారయ్యే ఈ పదార్థం వాంతి రూపంలో గడ్డగా బయటకు వస్తుంది. దీన్నే ఫ్లోటింగ్ గోల్డ్‌గా పిలుస్తారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments