Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం నిర్మాణం జాప్యానికి వైకాపా కాదు.. టీడీపీనే : మంత్రి అంబటి రాంబాబు

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (16:30 IST)
పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం నెలకొనడానికి తమ ప్రభుత్వం కాదని, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని ఏపీ నీటి పారుదల శాఖామంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆయన శుక్రవారం పోలవరం వద్ద జరుగుతున్న కాపర్ డ్యాం, డయాఫ్రం వాల్ పనులతో పాటు ఇతర పనులను కూడా పరిశీలించారు. ఆ తర్వాత ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. 
 
గత ప్రభుత్వం తొందరపాటు వల్ల పోలవరం ప్రాజెక్టుకు కష్టాలు వచ్చాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడానికి కూడా గత టీడీపీ ప్రభుత్వమే ప్రధాన కారణమని ఆయన అన్నారు. గత ప్రభుత్వం కాపర్ డ్యామ్ పనులను గాలికి వదిలివేసిందని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపర్ డ్యాప్ ఎత్తును పెంచామని చెప్పారు. 
 
అదేసమయంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. ఈ ప్రాజెకు నిర్మాణానికి కేంద్రం ఆసక్తి చూపకపోగా నిధులు కూడా ఇవ్వడం లేదన్నారు. అయినప్పటికీ రాష్ట్ర నిధులను ఖర్చు చేస్తూ ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments