Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాపై పోరులో ప్రజలంతా సైనికులే.. మన్‌కీ బాత్‌లో ప్రధాని

Webdunia
ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (11:35 IST)
కరోనాపై పోరులో ప్రజలంతా సైనికులేనని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం ఉదయం ఆయన మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ..కరోనాపై దేశ ప్రజలంతా యుద్ధం చేస్తున్నారని, చేయిచేయి కలిపి పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు.

కరోనాపై పోరుకు ప్రజలే నాయకత్వం వహిస్తున్నారని, మనం చేస్తున్న యుద్ధాన్ని ప్రపంచమంతా గమనిస్తోందన్నారు. భారత ప్రజల స్ఫూర్తి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ లాక్‌డౌన్‌ పాటిస్తున్నారని.. విపత్తు సమయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.

ప్రజలు ఆకలితో అలమటించకుండా రైతులు సాయం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ప్రజలు బాసటగా నిలిచారన్నారు. స్వచ్ఛ భారత్‌, శౌచాలయాల నిర్మాణాల్లోనూ ప్రజలు సహకరించారని.. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు.

కష్ట సమయంలో ఎంతోమంది దాతలు పేదలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో కొంత మొత్తాన్ని త్యాగం చేశారని ప్రధాని మోదీ తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments