Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల్లో గెలిపిస్తే మద్యంపై 50 శాతం రాయితీ...

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (11:34 IST)
ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ రకాల హామీలను గుప్పిస్తుంటారు. పార్టీలు అయితే వివిధ రకాల ఉచితాలను ఇస్తే.. అభ్యర్థులు కూడా సొంతంగా అది చేస్తాం.. ఇది చేస్తాం అని హామీలిస్తుంటారు. తాజాగా, ఓ రాజకీయ పార్టీ ఇచ్చిన హామీ ఇపుడు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. 
 
తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిస్తే మద్యంపై 50 శాతం డిస్కాంట్ ఇస్తామని, పండుగల సందర్భంగా ముస్లిం కుటుంబాలకు మేకలను ఉచితంగా ఇస్తామని ఢిల్లీలోని సాంజీ విరాసత్ పార్టీ హామీ ఇచ్చింది. మహిళలకు ఉచితంగా బంగారం అందజేస్తామని తెలిపింది.
 
అలాగే, పీహెచ్‌డీ వరకు ఉచిత విద్య, విద్యార్థులకు ఉచితంగా బస్సు, మెట్రో ప్రయాణం, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు మినహాయింపు, ఉచితంగా నిత్యావసరాల పంపిణీ, ఆడపిల్ల పుడితే రూ.50 వేలు, అమ్మాయి పెండ్లికి రూ.2.5 లక్షలు, నిరుద్యోగ భృతి రూ.10000, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నెలకు రూ.5000 పింఛన్, ప్రైవేట్ దవాఖానల్లో రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యసేవలు ఇలా పలు హామీలను కురిపించింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments