Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లింలు రోజాలో ఉండే రోజుల్లో ఎన్నికలా..? ఏంటిది? అజాం ఖాన్

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (18:42 IST)
దేశంలో ప్రస్తుతం చోటుచేసుకున్న పరిస్థితుల కారణంగా ముస్లీంలపై మరింత ప్రభావం పడిందని, వారిని కిరాయిదారులుగా చూస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ నేత అజాం ఖాన్ ఆవేదన వ్యక్తం చేసారు. ముస్లింలు రోజాలో ఉండే రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారని, ముస్లీంలను ఓటు వేయకుండా అడ్డుకునేందుకే ఇలాంటి చర్యలు చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. 
 
ఈ విషయం గురించి మీడియా అజాం ఖాన్ ముందు ప్రస్తావించగా ఆయన సమాధానమిచ్చారు. 'ప్రస్తుతం దేశంలో పరిస్థితి దారుణంగా మారిపోయిందని, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు చేసే ఆగడాల వల్ల ముస్లీంలను ఈ దేశంలో రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారని, అంతే కాకుండా కిరాయిదారులుగా పరిగణిస్తున్నారని, ఇది ఎంతమాత్రం సమంజసం అని' ఆవేదన వ్యక్తం చేసారు. 
 
ఎన్నికల తేదీలు మార్చడం మంచిదే అయినప్పటికీ ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎన్నికల కమీషన్ దీనిపై ఒక నోట్ తీసుకుని ఉండాలి. దీంతో ఎన్నికల కమీషన్ రాజకీయ పార్టీ కాదని స్పష్టమైందని చెప్పారు. అయితే రంజాన్ ముస్లీంలకు అతి ముఖ్యమైన పండుగ అని అన్నారు. 
 
వాయుదాడుల గురించి ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హాయాంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయని, అప్పుడు ఎవరూ ఇంతగా మాట్లాడుకోలేదని, ఇప్పుడు రక్తం, శవాలు, తలలతో రాజకీయాలు చేస్తున్నారని, జవానుల జీవితాలతో ఓట్లను సొమ్ము చేసుకునే పనిలో కొందరున్నారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments