Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్ కుమార్తె ఇంటిలో 60 సవర్ల బంగారం చోరీ

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (14:56 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె, హీరో ధనుష్ సతీమణి ఐశ్వర్య రజనీకాంత్ ఇంటిలో భారీ చోరీ జరిగింది. ఇంట్లోపడిన దొంగలు ఏకంగా 60 సవర్ల బంగారం నగలను చోరీ చేశారు. లాకర్లలో దాచిన ఈ నగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చెన్నై తేనాంపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
అయితే, ఈ చోరీ గత ఫిబ్రవరిలో జరిగింది. దీనిపై ఆమె అపుడే ఫిర్యాదు చేయగా ఇపుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం జరిగిన తన సోదరి వివాహంలో ఆ ఆభరణాలను ధరించానని, ఆ తర్వాత వాటిని ఇంట్లోనే లాకర్‌లో భద్రపరిచానని, అప్పటి నుంచి దాన్ని మళ్లీ తెరిచి చూడలేదని ఆమె ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 10న దాన్ని తెరిచి చూడగా.. అందులో విలువైన ఆభరణాలు కనిపించలేదన్నారు. ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురు పని మనుషులపై కూడా సందేహం ఉన్నట్టు ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఐశ్వర్ రజనీకాంత్.. విష్ణు విశాల్, విధార్థ్ హీరోలుగా రజనీకాంత్ గెస్ట్ పాత్రలో "లాల్ సలామ్" అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments