రజనీకాంత్ కుమార్తె ఇంటిలో 60 సవర్ల బంగారం చోరీ

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (14:56 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె, హీరో ధనుష్ సతీమణి ఐశ్వర్య రజనీకాంత్ ఇంటిలో భారీ చోరీ జరిగింది. ఇంట్లోపడిన దొంగలు ఏకంగా 60 సవర్ల బంగారం నగలను చోరీ చేశారు. లాకర్లలో దాచిన ఈ నగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చెన్నై తేనాంపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
అయితే, ఈ చోరీ గత ఫిబ్రవరిలో జరిగింది. దీనిపై ఆమె అపుడే ఫిర్యాదు చేయగా ఇపుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం జరిగిన తన సోదరి వివాహంలో ఆ ఆభరణాలను ధరించానని, ఆ తర్వాత వాటిని ఇంట్లోనే లాకర్‌లో భద్రపరిచానని, అప్పటి నుంచి దాన్ని మళ్లీ తెరిచి చూడలేదని ఆమె ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 10న దాన్ని తెరిచి చూడగా.. అందులో విలువైన ఆభరణాలు కనిపించలేదన్నారు. ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురు పని మనుషులపై కూడా సందేహం ఉన్నట్టు ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఐశ్వర్ రజనీకాంత్.. విష్ణు విశాల్, విధార్థ్ హీరోలుగా రజనీకాంత్ గెస్ట్ పాత్రలో "లాల్ సలామ్" అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments