Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమాన మరుగుదొడ్డిలో పాలిథిన్ కవర్లు - వస్త్రాలు.. విచారణకు ఏఐ ఆదేశం

ఠాగూర్
మంగళవారం, 11 మార్చి 2025 (09:28 IST)
ఈ నెల ఆరో తేదీ నుంచి షికాగో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానం పది గంటల ప్రయాణం తర్వాత తిరిగి షికాగోకు వెళ్లింది. ఈ వ్యవహారంపై విమానయాన సంస్థ విచారణ జరిపి ఓ స్పష్టతనిచ్చింది. 
 
ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా 126 విమానంలోనే టాయిలెట్ల సమస్య తలెత్తిందని, మొత్తం 12 టాయిలెట్లు ఉండగా, అందులో ఎనిమిది పని చేయడం లేదని సిబ్బంది గుర్తించారని సంస్థ పేర్కొంది. టాయిలెట్ పైపుల్లో పాలిథిన్ బ్యాగులు, దుస్తులు ఇరుక్కునిపోవడం వల్ల అవి పనిచేయడం లేదని తెలిపింది. 
 
ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురైనట్టు తెలిపింది. ఆ సమయంలో విమానం అట్లాంటిక్ మీదుగా ప్రయాణిస్తుండగా ఐరోపాలోని నగరాల్లో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించారు. రాత్రి సమయం కావడం, అక్కడి విమానాశ్రయాల్లో ల్యాండింగ్‌పై ఆంక్షలు ఉండటంతో తిరిగి షికాగోకు మళ్లించాల్సి వచ్చిందని విమానయాన సంస్థ వెల్లడించింది. 
 
ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ విమానాన్ని వెనక్కి మళ్లించాల్సి వచ్చిందని ఎయిరిండియా తెలిపింది. విమానాన్ని వెనక్కి మళ్లించిన అనంతరం ఎయిరిండియా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments