Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌హోస్టెస్‌పై ఉమ్మివేసిన పైలట్.. చెంప పగిలిపోయింది...

రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ విమానాశ్రయం వెలుపల ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ విమానయాన సంస్థకు చెందిన పైలట్, ఎయిర్‌హోస్టెస్‌లు బాహాబాహీకి దిగారు. దీంతో కొద్దిసేపు అక్కడు ఉద్రిక్తతత నెలకొంది.

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (10:18 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ విమానాశ్రయం వెలుపల ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ విమానయాన సంస్థకు చెందిన పైలట్, ఎయిర్‌హోస్టెస్‌లు బాహాబాహీకి దిగారు. దీంతో కొద్దిసేపు అక్కడు ఉద్రిక్తతత నెలకొంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
గుర్గావ్‌కు చెందిన అర్పిత అనే ఎయిర్ హోస్టెస్, ఆదిత్యకుమార్ అనే పైలట్‌లు ఓ ప్రైవేట్ విమానయాన సంస్థలో పని చేస్తున్నారు. వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆదిత్య మొబైల్‌ను అర్పిత పగులగొట్టేందుకు ప్రయత్నించగా సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది కలుగజేసుకొని అడ్డుకున్నారు. 
 
ఆ తర్వాత అర్పిత, ఆదిత్యల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఆదిత్య ఆమెపై ఉమ్మివేశాడు. దీంతో కోపోద్రిక్తురాలైన ఆమె ఆదిత్య చెంపపై కొట్టింది. అక్కడే ఉన్న భద్రతాసిబ్బంది కొట్టుకుంటున్న వారిని ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు వర్గాలు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది.
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments