Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుద్ధ విమానం మిస్సింగ్ కాలేదు.. కూలిపోయింది..13 మంది మృత్యువాత

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (09:42 IST)
భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం ఒకటి సోమవారం అదృశ్యమైందనీ వార్తలు వచ్చాయి. అయితే, ఈ విమానం మిస్సింగ్ కాలేదనీ, కూలిపోయినట్టు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ విమానం కూలిపోవడం వల్ల 13 మంది మృత్యువాతపడినట్టు అధికారులు వెల్లడించారు. 
 
అస్సాంలోని జోర్‌హాట్ నుంచి బ‌య‌లుదేరిన ఐఏఎఫ్ విమానం మిస్సైన‌ట్లు అధికారులు చెబుతున్నారు. ఆ విమానంలో 13 మంది ప్ర‌యాణిస్తున్నారు. ఆంట‌నోవ్ 32 విమానం.. 12.25 నిమిషాల‌కు టేకాఫ్ తీసుకున్న‌ది. అది అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మెచూకా ల్యాండింగ్ గ్రౌండ్‌కు వెళ్లాల్సి ఉంది. ఆ విమానం చివ‌రిసారిగా ఒంటి గంట‌కు కాంటాక్ట్ అయ్యింది. ఐఏఎఫ్ విమానం ఆచూకీ కోసం.. సుఖోయ్ 30 యుద్ధ విమానంతో గాలింపు చేప‌డుతున్నారు. 
 
సీ 130 స్పెష‌ల్ ఆప‌రేష‌న్ విమానాన్ని కూడా సెర్చ్ మిష‌న్ కోసం వాడుతున్నారు. ఐఏఎఫ్ ఏఎన్‌-32 విమానం ఎక్క‌డికి వెళ్లింద‌న్న దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఏఎన్ 32 విమానం.. భారత్- చైనా సరిహద్దులో నిన్న సాయంత్రమే కూలిపోయింది. ఈ విమానంలో ప్రయాణించిన 8 మంది సిబ్బంది, అయిదుగురు ప్రయాణికులు మరణించారు. ఈ యేడాదిలో ఇప్పటివరకు ఏఐఎఫ్‌కు చెందిన 11 విమానాలు కూలిపోయినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments