Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కేసులు పెరుగుతున్నాయి.. కానీ ఆందోళన అక్కర్లేదు : ఎయిమ్స్ డైరెక్టర్

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (13:11 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నంత మాత్రా ఆందోళన చెందాల్సిన పనిలేదని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా వెల్లడించారు. శనివారం దేశంలో 8329 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పది రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. 
 
ఈ పరిస్థితిపై రణ్‌దీప్ గులేరియా స్పందిస్తూ, దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. ఆస్పత్రిలో చేరికలు, మరణాల్లో మాత్రం ఎలాంటి పెరుగుదల లేదన్నారు. ఈ పెరుగుదల కొన్ని భౌగోళిక ప్రాంతాలకే పరిమితమైవుందని, కేసులు పెరుగుతుండటంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
 
కాకపోతే కొవిడ్‌ నిబంధనలను పాటించడంతో పాటు కొత్త వేరియంట్లను గుర్తించేందుకు వీలుగా భారీగా పరీక్షలు చేయించడంపై దృష్టిపెట్టాలి. కొవిడ్ నిబంధనల పట్ల అలసత్వం పనికిరాదని.. బూస్టర్‌ డోసు వేసుకోవాలని ఆయన కోరారు.
 
మరోవైపు, ఐసీఎంఆర్ ప్రతినిధి డాక్టర్ నివేదిక గుప్తా స్పందిస్తూ, కరోనా ఇంకా పూర్తిగా తొలగిపోలేదని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని కోరారు. అందరూ వ్యాక్సిన్లు వేయించుకోవాలని (ప్రికాషన్‌ డోసుతో సహా) సూచించారు. టీకాలు వేసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్‌ తీవ్రత తగ్గడంతో పాటు ఆస్పత్రి చేరికలను నివారించవచ్చన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments