Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాడీఎంకే పగ్గాలు శశికళ చేతిలో పెడితే.. పన్నీర్ సెల్వంకు కష్టమే: స్వామి

భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నాడీఎంకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు దివంగత సీఎం జయలలిత కన్నుమూసిన నేపథ్యంలో స్వామి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సోమవారం రాత

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (10:00 IST)
భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నాడీఎంకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు దివంగత సీఎం జయలలిత కన్నుమూసిన నేపథ్యంలో స్వామి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సోమవారం రాత్రి జయలలిత కన్నుమూయడంతో పన్నీర్‌ సెల్వం తన మంత్రివర్గ సహచరులతో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు దివంగత జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్‌ చేతిలో పెడితే కొత్తగా సీఎం పదవి చేపట్టిన పన్నీర్‌ సెల్వం స్వతంత్రంగా పనిచేయలేరని వ్యాఖ్యానించారు. 
 
అన్నాడీఎంకే ఒకే సంస్థగా మనుగడ సాగించలేదన్నారు. శశికళ పార్టీ బాధ్యతలు తీసుకుంటే సీఎం పన్నీర్‌ సెల్వం స్వతంత్రంగా పనిచేసే వీలు ఉండదని, ఆమె తన కుటుంబం నుంచి ఎవరినైనా ఆ పోస్టుకోసం ఒత్తిడి తీసుకువస్తారని అభిప్రాయపడ్డారు. పన్నీర్‌ సెల్వంకు పార్టీలో పునాదిలేకపోవడంతో శశికళ తన రాజకీయ చతురతతో పార్టీని హస్తగతం చేసుకుంటుందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments