Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళను ఇప్పుడల్లా పార్టీ నుంచి పీకేయలేరా..? ఎన్డీయేలోకి అన్నాడీఎంకే?

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించేందుకు ముగ్గురు మంత్రులు అడ్డం పడుతున్నారని తెలిసింది. దీంతో చిన్నమ్మను సాగనంపే ప్రక్రియకు సీఎం ఎడప్పాడి పళని స్వామి ముగింపు పలకలేకపోయారని వార్త

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (15:47 IST)
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించేందుకు ముగ్గురు మంత్రులు అడ్డం పడుతున్నారని తెలిసింది. దీంతో చిన్నమ్మను సాగనంపే ప్రక్రియకు సీఎం ఎడప్పాడి పళని స్వామి ముగింపు పలకలేకపోయారని వార్తలు వస్తున్నాయి. సోమవారం సాయంత్రం ఓపీఎస్ తన మద్దతుదారులతో కలిసి ప్రమాణ స్వీకారంలో పాల్గొననున్నారు. కొత్త మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. 
 
ఇప్పటికే ఓపీఎస్-ఈపీఎస్ వర్గాలు ఏకమైన తరుణంలో చిన్నమ్మను పార్టీ నుంచి తొలగించేందుకు ముగ్గురు మంత్రులు అంగీకరించలేదని తెలుస్తోంది. దినకరన్ తరహాలోనే చిన్నమ్మను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించేందుకు చేసిన తీర్మానంలో ముగ్గురు మంత్రులు సంతకాలు చేయకపోవడంతో వారిని బుజ్జగించే పనులు జరుగుతున్నాయని తెలిసింది.
 
అన్నాడీఎంకే ఇరు వర్గాలు ఏకమైన తరుణంలో ఎన్డీయేలో ఆ పార్టీ కలవనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తమిళనాడులో పర్యటించనున్న నేపథ్యంలో ఓపీఎస్-ఈపీఎస్ సమావేశమై పార్టీని ఎన్డీయేలో కలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ బీజేపీలో కలిసిన తరహాలోనే అన్నాడీఎంకే కూడా ఎన్డీయేలో కలిసిపోతుందని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments