Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ సర్కారుపై టీడీపీ అవిశ్వాస అస్త్రం... అన్నాడీఎంకేలో ముసలం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయోగించిన అవిశ్వాస అస్త్రం దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అదేసమయంలో అన్నాడీఎంకేలో ముసలం ఏర్పడింది.

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (10:54 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయోగించిన అవిశ్వాస అస్త్రం దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అదేసమయంలో అన్నాడీఎంకేలో ముసలం ఏర్పడింది. 
 
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని ఆ పార్టీ సీనియర్‌ నేత, అధికార ప్రతినిధి కేసీ పళనిస్వామి ప్రకటించారు. కావేరి మండలి ఏర్పాటుపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఈపరిస్థితుల్లో.. టీడీపీ ముందుకుతెచ్చిన అవిశ్వాస తీర్మానానికి అన్నాడీఎంకే మద్దతివ్వక తప్పదని వ్యాఖ్యానించారు. 
 
దీంతో ఖంగుతిన్న ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. కేసీ పళనిస్వామిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. అయితే తనపై వేటు వేయడాన్ని కేసీ పళనిస్వామి గర్హించారు. 
 
ముఖ్యమంత్రి ఈపీఎస్‌, ఉపముఖ్యమంత్రి ఓపీఎస్‌ల బండారం శనివారం బయటపెడతానని హెచ్చరించారు. పార్టీలో చీలిక రాబోతుందంటూ.. అధికార పక్షంలో కలకలం రేపారు. నిజానికి, కేసీ పళనిస్వామి అన్నాడీఎంకేలో సీనియర్‌ నాయకుడు. ఎంజీఆర్‌ హయాం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments