Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో బుల్లెట్ ట్రెయిన్... అహ్మదాబాద్-ముంబై... రూ. 88 వేల కోట్ల వ్యయం

భారతదేశంలో త్వరలో బుల్లెట్ ట్రెయిన్ పరుగులు తీయనుంది. అహ్మదాబాద్ - ముంబై మధ్య రూ. 88 వేల కోట్ల వ్యయంతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. మొత్తం 508 కిలో మీటర్ల దూరాన్ని ఈ బుల్లెట్ ట్రెయిన్ కేవలం 2 నుంచి 3 గంటల్లోనే చేరుకుంటుంది. మామూలుగా అయితే ఎక్స

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (16:22 IST)
భారతదేశంలో త్వరలో బుల్లెట్ ట్రెయిన్ పరుగులు తీయనుంది. అహ్మదాబాద్ - ముంబై మధ్య రూ. 88 వేల కోట్ల వ్యయంతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. మొత్తం 508 కిలో మీటర్ల దూరాన్ని ఈ బుల్లెట్ ట్రెయిన్ కేవలం 2 నుంచి 3 గంటల్లోనే చేరుకుంటుంది. మామూలుగా అయితే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ వ్యవధి 8 గంటల పాటు సాగుతుంది. ఐతే ఈ బుల్లెట్ రైలుతో ప్రయాణ కాలం సుమారు 5 గంటలకు పైగా ఆదా అవుతుంది. ఈ రైలు మార్గాన్ని భూమికి 20 మీటర్ల పైన పిల్లర్లతో నిర్మించనున్నారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుకు జపాన్ ప్రధాని శంకుస్థాపన చేసేందుకు బుధవారం భారతదేశానికి వచ్చారు.
 
ప్రోటోకాల్ పక్కన పెట్టి జపాన్ ప్రధానికి స్వాగతం చెప్పేందుకు ప్రధానమంత్రి మోదీ విమానాశ్రయానికి వెళ్లారు. జపాన్‌ ప్రధాని షింజో అబె భార‌త ప్ర‌ధాని మోదీతో క‌లిసి గుజ‌రాత్‌లోని అహ్మదాబాద్‌ రోడ్‌షోలో పాల్గొన్నారు. అనంతరం జపాన్ ప్రధానమంత్రి మాట్లాడుతూ... భార‌తదేశంతో త‌మ దేశానికి మ‌ధ్య ఉన్న‌ బంధం ప్రపం‍చంలోనే అత్యంత శక్తిమంతమైనదని అన్నారు. భారతదేశంతో వ్యాపార సంబంధాలను మరింత పెంచుకునేందుకు జపాన్ దేశం ఆసక్తిగా వున్నట్లు వెల్లడించారు. తమకున్న సాంకేతిక శక్తితో భారతదేశంలోని మానవ వనరులతో కలిపి భవిష్యత్తులో తిరుగులేని విజయాలను సాధిస్తామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments