అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

ఠాగూర్
ఆదివారం, 15 జూన్ 2025 (14:01 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఏకంగా 241 మంది విమాన ప్రయాణికులు ప్రాణాలు కో్ల్పోగా, ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకు 31 మంది మృతదేహాలను గుర్తించి, 12 కుటుంబాలకు అప్పగించారు. 
 
అలాగే, ప్రమాదంలో గాయపడిన మరో 13 మందికి ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. మృతదేహాల గుర్తింపు ప్రక్రియలో ఫోరెన్సిక్ బృందాలు నిరంతరంగా కృషి చేస్తున్నాయి. ఇంకా గుర్తించాల్సిన మృతదేహాల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతదేహం కూడా ఉందని ఆయన డీఎన్ఏ పరీక్షా ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. 
 
ఇదే అంశంపై సివిల్ ఆస్పత్రి ఏడీఎంఎస్ డాక్టర్ రజనీష్ పటేల్ మాట్లాడుతూ, ఇప్పటివరకు 31 మంది వ్యక్తుల డీఎన్ఏ సరిపోలింది. వారిని గుర్తించాం. వీరిలో 12 మృతదేహాలను ఉదయ్‌పూర్, వడోదర, ఖేడా, కుషీనగర్, అహ్మదాబాద్‌లలోని వారి స్వస్థాలకు పంపించాం అని తెలిపారు. మిగిలినవారి ఆప్తుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు మరికొన్ని కుటుంబు ముందుకు రావాల్సి ఉందన్నారు. ఇతరుల డీఎన్ఏ ఫలితాలు ఇంకా రావాల్సి వుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments