Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవులను కాపాడిన అక్కాచెల్లెలు...భయంతో పారిపోయిన మృగరాజు

ఆవులను కాపాడుకోవడం కోసం ఇద్దరు యువతులు ఏకంగా మృగరాజుతోనే పోరుకు దిగిన సంఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. సంతోక్‌ రబరీ(19), మయ్యా(18) అనే అక్కాచెల్లెళ్లు గిర్‌ అభయారణ్యం సమీపంలోని ఒక కుగ్రామంలో నివసిస్తు

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (12:03 IST)
ఆవులను కాపాడుకోవడం కోసం ఇద్దరు యువతులు ఏకంగా మృగరాజుతోనే పోరుకు దిగిన సంఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. సంతోక్‌ రబరీ(19), మయ్యా(18) అనే అక్కాచెల్లెళ్లు గిర్‌ అభయారణ్యం సమీపంలోని ఒక కుగ్రామంలో నివసిస్తున్నారు. ప్రఖ్యాత ఆసియాటిక్‌ సింహాలు ఈ అడవిలోనే సంచరిస్తుంటాయి. తండ్రి అనారోగ్యం పాలవడంతో కుటుంబానికి జీవనాధారమైన పశువులను మేపే బాధ్యత కొన్నేళ్లుగా ఈ అక్కాచెల్లెళ్లపై పడింది.
 
ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఆవులను మేపుతుండగా ఆసియాటిక్ సింహం ఒకటి అక్కడికి వచ్చింది. సాధారణంగా సింహాన్ని చూస్తే ఎవరైనా భయపడి పారిపోతారు. కానీ ఈ సోదరిలు ఏమాత్రం భయపడకుండా అలా ఉండిపోయారు. సింహం బారి నుంచి తమను తాము కాపాడుకోవడమే కాక తమ జీవనాధారమైన ఆవుల ప్రాణాలను కూడా కాపాడాలని నిశ్చయించుకున్నారు. ఆవులను కాపాడేవిషయంలో ప్రాణాలు కోల్పోయిన పర్వాలేదని అనుకున్నారు.
 
దీంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా, చేతుల్లోని దుడ్డు కర్రలతో సింహానికి ఎదురుగా నిలబడ్డారు. మనోధైర్యంతో ముందుకు వచ్చిన ఆ అక్కాచెల్లెళ్ల ధైర్యం చూసి సింహం ఏమనుకుందో ఏమో కానీ.. వారి మీద దాడి చేయకుండా వెనుదిరిగి వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు, అటవీ సంరక్షణ అధికారులు ఆ బాలికల ధైర్యానికి మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా పెద్దమ్మాయి సంతోక్ మాట్లాడుతూ, ''సింహాలకు వెన్ను చూపిస్తే అవి మనపైన దాడిచేస్తాయి, ధైర్యంగా ముఖాముఖి ఎదురుపడితే ఏం చేయకుండా వెళ్లిపోతాయి'' అని చెప్పింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments