Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృతి చెందిన కుమారుడు.. కోడలికి రెండోళ్లి చేసిన మామ

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (10:47 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఒక పార్లమెంట్ మాజీ సభ్యుడు చేసిన పనిని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. తన కుమారుడు అకాల మరణం చెందడంతో వితంతువైన తన కోడలికి రెండో పెళ్లి చేశారు. తన కొడుకు అనారోగ్యంతో చనిపోగా ఒంటరి జీవితం సాగిస్తున్న కోడలికి తండ్రి స్థానంలో నిలిచి మరో వ్యక్తితో వివాహం జరిపించారు. 
 
ధమ్‍తరీకి చెందిన మాజీ ఎంపీ చందూలాల్ సాహు చేసిన ఈ పనిని ప్రతి ఒక్కరూ వేనోళ్ళ ప్రశంసిస్తున్నారు. ఈయన పదేళ్ల క్రితం తన కుమారుడు కళ్యాణి సాహుకు పెళ్లి చేశారు. ఆ తర్వాత నాలుగేళ్ళకు చందూలాల్ తనయుడు అనారోగ్యంతో మరణించడంతో యేడాదిన్నర వయస్సున్న కుమారుడితో తన కోడలు ఒంటరిగా జీవిస్తుంది. 
 
ఆమెను చూసి మనస్సు చలించిపోయిన చందూలాల్‌కు రెండో వివాహం చేసేందుకు తగిన వరుడుని స్వయంగా వెతికారు. ధమ్‍తరీకి చెందిన డాక్టర్ వీరేంద్ర గంజీర్ గురించి ఆయనకు తెలిసింది. వీరేంద్రకు కూడా గతంలో పెళ్లి కాగా ఆయన భార్య కూడా గుండెపోటుతో చనిపోయింది.
 
అప్పటి నుంచి ఆయన తన కుమార్తెతో ఒంటరిగా జీవిస్తున్నాడు. వారిద్దరి అసంపూర్ణ జీవితాల్లో వెలుగులు నింపడానికి ఇరు కుటుంబాల సభ్యులు వారికి వివాహం చేయించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఈ వివాహం ధమ్‌తరీ వింధ్యావాసిని ఆలయంలో జరిగింది. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments