తెలంగాణాపై దృష్టిసారించిన కేజ్రీవాల్ - 14 నుంచి ఆప్ పాదయాత్రలు

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (13:47 IST)
ఢిల్లీ నుంచి పంజాబ్‌కు విస్తరించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇపుడు తెలంగాణ రాష్ట్రంపై దృష్టిసారించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్ అదే జోష్‌తో తెలంగాణాలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులోభాగంగా ఏప్రిల్ 14వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించేందుకు సమాయాత్తమవుతుంది. 
 
వచ్చే నెల 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆప్ ఆధ్వర్యంలో తెలంగాణాలో పాదయాత్రలు ప్రారంభమవుతాయి. వీటిని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభిస్తారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఆప్ తెలంగాణ సెర్చ్ కమిటీ ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణాలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పాదయాత్రలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. 
 
కాగా, ఇటీవల వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ రాష్ట్రంలో ఆప్ పార్టీ విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. దీంతో ఢిల్లీ తర్వాత పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments