Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాజపాకు మరో మిత్రపక్షం టాటా...

భారతీయ జనతా పార్టీ చేజేతులా కష్టాలు కొనితెచ్చుకునేలా కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన భాగస్వామ్య పార్టీలన్నీ ఒక్కొక్కటిగా పారిపోతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో బలమైన మిత్రపక్షంగా ఉన్న శివసేన టాటా చెప్ప

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (16:33 IST)
భారతీయ జనతా పార్టీ చేజేతులా కష్టాలు కొనితెచ్చుకునేలా కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన భాగస్వామ్య పార్టీలన్నీ ఒక్కొక్కటిగా పారిపోతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో బలమైన మిత్రపక్షంగా ఉన్న శివసేన టాటా చెప్పగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. 
 
ఇంతలో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో మూడు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి తేరుకోలేని షాకిచ్చారు. ముఖ్యంగా, యూపీలో కంచుకోటగా భావించే గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి తన ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఈ ఫలితాలను చూసిన బీజేపీ మిత్రపక్షాలు చడీచప్పుడు కాకుండా జారుకుంటున్నాయి. 
 
ఇందులోభాగంగా కేరళకు చెందిన ఎన్డీయే మిత్రపక్షం భారత్ ధర్మ జన సేన(బీడీజేఎస్) టాటా చెప్పేసింది. కొద్దిరోజులుగా ఎన్డీఏ నుంచి వైదొలగాలా.. వద్దా అన్న అంశంపై మీమాంసలో ఉన్న బీడీజేఎస్.. యూపీ, బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా రావడంతో పొత్తు తెంచుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. బుధవారం ఈమేరకు పార్టీ నేతలు సమావేశమై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో కేరళలో ఉన్న ఒకే ఒక్క మిత్రపక్ష పార్టీని ఎన్డీఏ (బీజేపీ) కోల్పోయినట్టయింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments