తమిళనాడుకు మరో వాయు'గండం' - రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలెర్ట్

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (08:27 IST)
తమిళనాడు రాష్ట్రాన్ని మరో అల్పపీడనం చుట్టుముట్టనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుందని చెన్నై వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 
 
ఈ వాయుగుండం ప్రభావంతో  డిసెంబరు 2న అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ముందుగానే రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్‌కు సమీపంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం ఆదివారం మరింతగా బలపడిన విషయం తెల్సిందే. ఇది సోమవారం వాయుగుండంగా మారనుంది. 
 
దీని ప్రభావంతో రేపు సముద్ర తీర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడనుండగా, ఎల్లుండి అన్ని జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రేపు ఇది 'బురేవి' తుఫానుగా మారి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో రెండు రోజుల ముందుగానే రెడ్ అలెర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 
 
మరోవైపు, నివర్ తుఫాను నష్టాన్ని అంచనా వేసేందుకు సోమవారం తమిళనాడుకు కేంద్ర బృందం రానుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అశుతోష్‌ అగ్నిహోత్రి నేతృత్వంలో ఏడుగురు అధికారుల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షణ్ముగంతో భేటీ అవుతుంది. అనంతరం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి పళనిస్వామితో భేటీ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments