Webdunia - Bharat's app for daily news and videos

Install App

2020కి ఏమైంది..? ఎక్కడ చూసినా ప్రకృతి వైపరీత్యాలే.. ముంబైలో?

Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (13:54 IST)
2020కి ఏమో అయ్యింది. ఈ ఏడాది ప్రపంచానికి అంతలా కలిసిరాలేదు. ఎక్కడ చూసినా ప్రమాదాలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు ప్రాణ నష్టాలను మిగిలిస్తోంది. మానవ తప్పిదాల వల్ల పెను ప్రమాదాలు సంభవిస్తున్నాయి. 
 
ఇక విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన మరువక ముందే మరో రెండు మూడు చోట్ల గ్యాస్ లీక్ ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఇదే తరహాలో ప్రస్తుతం ముంబైలో కూడా చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని చెంబూర్ సమీపంలోని గోవండి (ఈస్ట్) ప్రాంతంలో గల యూఎస్ విటమిన్ ఫార్మా కంపెనీ నుంచి శనివారం రాత్రి 9.53 నిమిషాలకు గ్యాస్ లీక్ అయినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
 
ఇక ఈ గ్యాస్ లీక్ అవడం వల్ల దీని ప్రభావం ఐదు ప్రాంతాలపై తీవ్రంగా పడగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా ఈ సంఘటన గురించి తెలుసుకున్న ముంబై అధికారులు 17 బృందాలను అక్కడికి పంపి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి పరిస్దితిని అదుపులోకి తెచ్చినట్టు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments