Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి కోసం భర్తను సైనైడ్ కలిపిన ఆరెంజ్ జ్యూస్ తాగించి చంపిన భార్య

Webdunia
మంగళవారం, 12 నవంబరు 2019 (15:22 IST)
కేరళలో నూనె వ్యాపారం చేసేవాడు శ్యామ్. సోఫియా అనే యువతిని ఇచ్చి ఆరేళ్ళ క్రితం వివాహం చేశారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. ప్రశాంతంగా సాగిపోతున్న వీరి జీవితంలో వివాహేతర సంబంధం ప్రాణాల మీదకు తెచ్చింది. పెళ్ళి కాకముందు నుంచి ఉన్న ప్రియుడిని వదులుకోలేక భర్తను అతి దారుణంగా చంపేసింది భార్య.
 
కేరళలో రెండు సంవత్సరాల పాటు ఉన్న ఈ ప్రేమ జంట ఆస్ట్రేలియాలో స్థిరపడింది. సోఫియా ప్రియుడు అరుణ్ కూడా అక్కడే ఉండేవాడు. సోఫియాకు కొడుకు పుట్టిన తరువాత అరుణ్‌తో సోఫియా రెగ్యులర్‌గా కలుస్తూ ఉండేది. వీరి మధ్య సంవత్సరానికి పైగా వివాహేతర సంబంధం కొనసాగుతూ వచ్చింది.
 
అయితే శ్యామ్ ఆస్ట్రేలియాలో బాగానే ఆస్తులు కూడబెట్టాడు. భర్తతో కాపురం చేయడానికి ఇష్టపడని సోఫియా ఎలాగైనా అతన్ని చంపేయాలని ప్రియుడు అరుణ్‌‌తో కలిసి ప్లాన్ చేసింది. సైనైడ్ కలిపిన ఆరెంజ్ జ్యూస్ తాగించింది. దీంతో శ్యామ్ అక్కడికక్కడే చనిపోయాడు. దీనితో తన భర్త గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు శ్యామ్‌కు పోస్టుమార్టం నిర్వహించగా అసలు విషయం బయటపడింది. ప్రియుడు అరుణ్‌కు 25 యేళ్ళ జైలు, సోఫియాకు 22 యేళ్ళ జైలు శిక్ష విధించింది ఆస్ట్రేలియా కోర్టు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments