Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెండ్ చెల్లెలితో శారీరక సంబంధం, అడ్డొస్తున్నాడని కిడ్నాప్ చేసి?

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (22:55 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ ప్రాంతమది. అక్కడ నివసిస్తున్న దీపక్, విపిన్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకరి కోసం మరొకరు ప్రాణం ఇచ్చేంత స్నేహితులు వారు. అయితే దీపక్‌కు విపిన్ చెల్లెలిపై కన్ను పడింది. తరచూ విపిన్ ఇంటికి వెళ్ళే దీపక్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
 
ఆ పరిచయం కాస్తా శారీరక సంబంధానికి దారితీసింది. ఇది గత మూడు నెలలుగా సాగుతోంది. స్నేహితుడి చెల్లెలిని చెల్లెలిగానే భావిస్తున్నాడని విపిన్ అనుకునేవాడు. అందుకే తన ఇంటికి వస్తున్న దీపక్‌ను ఆపేవాడు కాదు. కానీ అసలు విషయం కాస్తా ఆలస్యంగా తెలుసుకున్నాడు విపిన్. 
 
దీపక్‌ను హెచ్చరించాడు. అయినా మార్పు రాలేదు. దీంతో కోపంతో దీపక్‌పై చేయిచేసుకున్నాడు. తననే కొట్టాడని విపిన్ హత్యకు ప్లాన్ చేశాడు దీపక్. వెంటనే తన ఇద్దరు స్నేహితులు అశ్రు, రోహిత్‌ల సహాయంతో చంపేద్దామని నిర్ణయించుకున్నాడు. అయితే వారు సహకరించకపోవడంతో విపిన్ ఒక్కడే దీపక్‌ను హత్య చేశాడు.
 
ఆ తరువాత మృతదేహాన్ని తన ఇంటి ఆవరణలోనే అర్థరాత్రి పూడ్చేసి విషయం తన ఇద్దరు స్నేహితులకు చెప్పాడు. అశ్రు, రోహిత్‌లను పోలీసులకు ఫోన్ చేసి దీపక్‌ను కిడ్నాప్ చేసినట్లు చెప్పమన్నాడు. స్నేహితుడి కోసం వారిద్దరూ పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేసి దీపక్‌ను కిడ్నాప్ చేశామని 20 లక్షలు కావాలని డిమాండ్ చేశారు.
 
అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అదంతా విపిన్ ఆడిస్తున్న నాటకమని తేలింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments