Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామేశ్వరంలో కలాం అంత్యక్రియలు గురువారం ఉదయం 10.30 గంటలకు

Webdunia
మంగళవారం, 28 జులై 2015 (16:39 IST)
షిల్లాంగ్‌లో అకాలమరణం చెందిన మాజీ రాష్ట్రపతి అంత్యక్రియలు గురువారం ఉదయం 10.30 గంటలకు ఆయన పుట్టిపెరిగిన రామేశ్వరంలో జరుగనున్నాయి. ఈ వేడుకల కోసం తమిళనాడు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఇందులోభాగంగా కలాం అంత్యక్రియలు జరిగే ప్రదేశాన్ని కన్యాకుమారి జిల్లా కలెక్టర్, ఎస్పీలు పరిశీలించి, అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈ అంత్యక్రియల ఏర్పాట్లను తమిళనాడు సీనియర్ మంత్రి ఒ.పన్నీర్ సెల్వం పర్యవేక్షించేలా ముఖ్యమంత్రి జయలలిత ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు.
 
ఇదిలావుండగా, ప్రస్తుతం ఢిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఉన్న కలాం అధికారిక నివాసంలో ఆయన పార్థివదేహం ఉంది. ఇక్కడ వివిధ పార్టీలకు చెందిన నేతలు కలాంకు నివాళులు అర్పిస్తున్నారు. అనంతరం రేపు ఉదయం ఢిల్లీ నుంచి తమిళనాడులోని రామేశ్వరానికి ఆయన పార్థివదేహాన్ని తరలిస్తారు. అక్కడ ప్రజల సందర్శనార్థం రాత్రి 7 గంటల వరకు ఉంచుతారు. ఆ తర్వాత గురువారం ఉదయం 10.30 గంటలకు కలాం అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా జరుగుతాయని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వాస్తవానికి కలాం అంత్యక్రియలు బుధవారమే జరుగుతాయన్న వార్తలు వచ్చాయి. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments