మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి - ఆపై రాజీనామా

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (10:52 IST)
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన మంత్రి మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ఆ మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు. ఆ మంత్రి పేరు రాజేంద్ర పాల్ గౌతమ్. ఢిల్లీలో జరిగిన ఓ మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఓ వర్గం ప్రజల మనోభవాలు దెబ్బతినేలా ప్రసంగించి వివాదంలో చిక్కుకున్నారు. 
 
ఇదే అదునుగా భావించిన బీజీపీ, వీహెచ్‌పీలు మంత్రిపై విమర్శలు దాడి మొదలుపెట్టాయి. మతమార్పిడి కార్యక్రమంలో ఏకంగా మంత్రి పాల్గొనడం సిగ్గుచేటంటూ విరుచుకుపడ్డాయి. ఆయన్ను తక్షణం మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో రాజేంద్ర పాల్ గౌతమ్ ఆదివారం తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. 
 
రాజీనామా చేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ, తాను సంకెళ్ల నుంచి విముక్తి పొందినట్టు చెప్పారు. ఈ రోజు మళ్లీ పుట్టానని, ఇకపై ఎలాంటి ఆంక్షలు లేకుండా హక్కు కోసం, సమాజంపై జరిగే దౌర్జన్యాల వియంలో మరింత గట్టిగా పోరాటం చేస్తానని చెప్పారు. పనిలోపనిగా తన రాజీనామా లేఖను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments