Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో దారుణం: కోరిక తీర్చలేదని ప్రియురాలి హత్య!

Webdunia
బుధవారం, 23 జులై 2014 (11:06 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. తన కోరిక తీర్చలేదని ఆగ్రహానికి గురైన ఓ యువకుడు తన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లాలోని పూండి యూనియన్ పరిధిలోని నైవేలి గ్రామానికి చెందిన కుప్పన్ కుమార్తె చాముండేశ్వరి(19), అదే గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. 
 
అయితే చాముండేశ్వరి మనవాలనగర్ ప్రాంతానికి చెందిన మరో యువకుడితో ప్రేమలో పడి రాజ్‌కుమార్‌ను దూరంగా ఉంచింది. ఈ నేపథ్యంలో చాముండేశ్వరిపై కోపం పెంచుకున్న రాజ్ కుమార్.. చివరిసారిగా ఒకసారి మాట్లాడాలని ఆమెను కోరాడు. దీంతో తన ఇంటి సమీపంలోకి వచ్చిన రాజ్ కుమార్‌ను ఆ యువతి కలిసింది. తన కోరికను తీర్చాలని నిందితుడు ఆమెను బలవంత పెట్టాడు. అందుకు అంగీకరించకపోవడంతో చాముండేశ్వరి తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ విషయాలన్నింటినీ పోలీసుల విచారణలో నిందితుడు రాజ్‌కుమార్ వెల్లడించాడు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments