Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంపుడు ఎలుకను చంపినందుకు పదేళ్ల బాలికను కొట్టి చంపిన విద్యార్థి

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (13:13 IST)
తను పెంచుకున్న పెంపుడు ఎలుకను చంపేసిందన్న కారణంతో పదేళ్ల బాలికను 11 ఏళ్ల విద్యార్థి దారుణంగా కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో ఈ సంఘటన చోటుచేసుకున్నది. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం లసూడియా పరిధిలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి 10 ఏళ్ల బాలికను తాను పెంచుకుంటున్న ఎలుకను చంపేసిందన్న అనుమానంతో బాలికతో గొడవపడ్డాడు.
 
అనంతరం బండరాయితో ఆమె తలపై మోది హత్య చేసి పరారయ్యాడు. ఈ కేసును పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. అదుపులోకి తీసుకున్న బాలుడ్ని బాల నేరస్తుల శిక్షణాలయానికి తరలిస్తామని డీఐజీ హరినారాయణాచారి మిశ్రా తెలిపారు. అనుమానంతో బాలుడిని అదుపులోకి తీసుకోగా అసలు విషయం చెప్పినట్లు ఆయన తెలిపారు.
 
తాను పెంచుకుంటున్న ఎలుకను చంపేసిందన్న అనుమానంతో నిన్న బాలికతో గొడవ పడ్డాడు. అనంతరం పెద్ద రాయితో ఆమె తలపై కొట్టడంతో చిన్నారి చనిపోయిందని వివరించారు. తలపై గాయం కావడంతో రక్తస్రావం జరిగి బాలిక మరణించినట్లు డీఐజీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments