రిసార్టులో ఎంజాయ్ చేయడానికి వచ్చి శవాలై తేలిన టెక్కీ కుటుంబం

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (18:28 IST)
మధ్యప్రదేశ్ నగరం ఇండోర్, ఖుడైల్ లోని క్రెసెంట్ వాటర్ పార్క్‌లోని అపోలో డిబి సిటీలో నివశిస్తున్న ఒక ఇంజనీర్, అతని భార్యతో ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. నలుగురూ విషపూరిత వస్తువులను తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారని ప్రాధమికంగా వెల్లడైంది. క్రెసెంట్ వాటర్ పార్కులో ఒక రిసార్ట్ ఉంది. ఇక్కడ అతిథులు కూడా అద్దెకు గదులు తీసుకుంటారు. 
 
డిబి సిటీలో నివసిస్తున్న అభిషేక్ సక్సేనా (45) ఒక రోజు ముందు గదిని అద్దెకు తీసుకున్నాడు. గురువారం కుటుంబ సభ్యులు గది నుండి బయటకు రాకపోవడంతో, రిసార్ట్ సిబ్బందికి అనుమానం వచ్చి తలుపు కొట్టారు. కానీ ఎంతకీ తలుపులు తీయకపోవడంతో మాస్టర్ కీ ఉపయోగించి తలుపులు తెరిచినప్పుడు గది లోపల నలుగురు విగతజీవులుగా కనబడ్డారు.
 
దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతులను అభిషేక్ సక్సేనా(45), అతని భార్య ప్రీతి సక్సేనా (42), కుమారుడు అద్వైత్ (14), కుమార్తె అనన్య(14) గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నలుగురి శరీరం నీలం రంగులోకి మారిపోయింది. ఒక విషపూరిత రసాయనం సమీపంలో కనబడింది. వారంతా ఈ రసాయనాన్ని తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. కాగా వారి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments