Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహమైన గంటలోపే భార్యకు విడాకులు.. ఆ తర్వాత తమ్ముడికిచ్చి పెళ్లి.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (07:22 IST)
సాధారణంగా వివాహం అంటే నూరేళ్ళ పంట అన్నారు మన పెద్దలు. కానీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంభాల్ జిల్లాలో పెళ్లి అయిన గంటకే ఓ జంట విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమెను తన తమ్ముడికిచ్చి పెళ్లి చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని అస్మోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దబోయి ఖుర్ద్ గ్రామంలో ఓ జంటకు పెళ్లి జరిగింది. పెళ్లికొచ్చిన వారంతా ఆనందోత్సవాల్లో మునిగితేలుతున్నారు. ఆ సమయంలో ఓ అనుకోని అతిథి మండపానికి వచ్చింది. దీంతో అక్కడ సమస్య మొదలైంది. ఆ అతిథి ఎవరో కాదు.. పెళ్లి కుమారుడు మొదటి భార్య.
 
తాను జీవించివుండగా, రెండో పెళ్లి ఎలా చేసుకుంటావు అని భర్తతో గొడవకు దిగింది. గొడవ పెద్దది కావడంతో గ్రామపెద్దలు అక్కడికి చేరారు. మరోవైపు, భార్యకు నచ్చజెప్పేందుకు పెళ్లి కొడుకు వేషధారణలో ఉన్న భర్త ప్రయత్నించినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. విషయం పోలీసులకు చేరడంతో వారొచ్చి వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. 
 
మరో వైపు గ్రామపెద్దలు సమావేశమై ఈ సమస్యకు ఓ చక్కని పరిష్కారం కనుగొన్నారు. గంట క్రితం మనువాడిన రెండో భార్యకు విడాకులిచ్చి.. ఆమెను అతని తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని ప్రతిపాదించారు. దీంతో ఎలాంటి సమస్య ఉండదని, ఇద్దరు మహిళలకు న్యాయం చేసినట్టువుతుందని సర్ది చెప్పారు. ఈ సలహా నచ్చడంతో మొదటి భార్య కూడా మిన్నకుండిపోయింది. దీంతో ఒక గంట క్రితం వివాహం చేసుకున్న మహిళకు విడాకులిచ్చిన భర్త.. ఆమెను తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయించాడు. దీంతో పోలీసు కేసుల గొడవ లేకుండానే సమస్య పరిష్కారమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments