Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.4 వేల కోట్లతో శబరిమలలో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణం

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (13:25 IST)
కేరళ రాష్ట్రంలోని ప్రఖ్యాత పుణ్యస్థలంగా పేరుగడించిన శబరిమల సమీపంలోని ఎరుమేలి సెరువల్లి ఎస్టేట్‌లో కొత్త విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన శాఖ ఆమోదం తెలిపింది. ఆధ్యాత్మిక పర్యాటకానికి ఇది శుభవార్త అని ప్రధాని నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు.
 
కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. సింగపూర్, మలేషియా, నేపాల్ వంటి దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఆలయాన్ని సందర్శించే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్థానం వివిధ సౌకర్యాలు కల్పించాయి. 
 
ఇపుడు ఈ ప్రాంతానికి విమాన సేవలు కూడా ప్రారంభంకానున్నాయి. శబరిమల సమీపంలోని కొట్టాయం జిల్లాలోని ఎరుమేలి చెరువల్లి ఎస్టేట్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ సహకారంతో 2,250 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,000 కోట్లతో విమానాశ్రయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 
 
ఈ విషయమై కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలకు దరఖాస్తు చేసింది. రక్షణ శాఖ ఇప్పటికే మొదటి దశ క్లియరెన్స్ ఇచ్చింది. ఇపుడు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా సమ్మతం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments