Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరునల్వేలిలో వరదలు అబ్బబ్బా.. కాంక్రీట్ భవనమే కూలిపోయింది..

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2023 (18:14 IST)
Tirunelveli
తమిళనాడు దక్షిణాది జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. దక్షిణ తమిళనాడులో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది.
 
దీనిపై తమిళనాడు వర్షాలపై చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్ బాలచంద్రన్ మాట్లాడుతూ, "రాబోయే 24 గంటలపాటు, తెన్‌కాసి, తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాలకు 'రెడ్' అలర్ట్ కొనసాగుతుంది.. అన్నారు.
 
డిసెంబర్ 16 ఉదయం నుండి డిసెంబర్ 17 వరకు తిరునెల్వేలి అతి భారీ వర్షపాతాన్ని చవిచూసింది. కన్యాకుమారి, రామనాథపురం, పుదుకోట్టై, తంజావూరు, తిరువారూర్, నాగపట్నంతో సహా ఇతర జిల్లాలలో కూడా  భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ నివేదించింది.
 
తూత్తుకుడిలోని తిరుచెందూర్‌లో సోమవారం తెల్లవారుజామున 1:30 గంటల వరకు 606 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. భారీ వర్షాల కారణంగా తిరునల్వేలి జలమయం అయ్యింది. 
 
రోడ్లపై వరద నీరు చెరువుల్లా దర్శనమిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ భవనాలు సగానికి సగం నీటిలో మునిగిపోయాయి. అలాగే ఓ భవనం భారీ వరదల కారణంగా నేలమట్టమైంది.

వరద ధాటికి ఓ కాంక్రీట్ భవనం మొత్తం నేలమట్టం అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments