Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రైన్‌లో ఫోన్ మాట్లాడుతూ ఫీట్స్ చేసిన యువతి... చివరికి?

ఆ అమ్మాయి వయస్సు 18 ఏళ్లు. అబ్బాయిలు మాత్రమేనా నేను కూడా ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేస్తానంటూ లోకల్ ట్రైన్‌లో సీట్లు ఖాళీగా ఉన్నా సరే ఫుట్‌బోర్డ్ దగ్గర నిలుచుంది.

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (11:40 IST)
ఆ అమ్మాయి వయస్సు 18 ఏళ్లు. అబ్బాయిలు మాత్రమేనా నేను కూడా ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేస్తానంటూ లోకల్ ట్రైన్‌లో సీట్లు ఖాళీగా ఉన్నా సరే ఫుట్‌బోర్డ్ దగ్గర నిలుచుంది. అప్పటికే చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతూ ఉంది. ఇది సరిపోదన్నట్లు మధ్యలో ఉన్న పల్ పట్టుకుని విన్యాసాలు చేయడం మొదలుపెట్టింది. అలా చేస్తూ చేస్తూ మధ్యలో పట్టు తప్పిపోయి కింద పడి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంది. 
 
అయితే అదృష్టం బాగుండటం వలన ప్రాణాలతో బయటపడింది. ఏ మాత్రం ఆలస్యం జరిగి ఉన్నా ప్రాణాలు కోల్పోయేదే. వివరాలను పరిశీలిస్తే... ముంబైలో ఘాట్‌కోపర్, విక్రోలీ స్టేషన్ల మధ్య తిరుగుతున్న రైలులో థానె జిల్లా దివాకు చెందిన ఆ యువతి సీఎస్‌టీలో కల్యాణ్ వెళ్లే ట్రెయిన్ ఎక్కింది. అప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది.
 
ఈ అమ్మాయి విన్యాసాలు చేస్తూ మధ్యలో పట్టు తప్పి ట్రెయిన్ కిందికి జారిపోయింది, అంతలో వెంటనే స్పందించిన ఇతర ప్రయాణికులు ఆ యువతిని పైకి లాగి, ఆమె ప్రాణాలను కాపాడారు. ప్రయాణికులు ఏమాత్రం అలక్ష్యం చేసి ఉన్నా ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. ఈ సంఘటన సోమవారం జరగగా, ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments