Webdunia - Bharat's app for daily news and videos

Install App

లష్కర్ చీఫ్‌గా కాశ్మీర్ ఉగ్రవాది? అదే జరిగితే తొలి కాశ్మీరీగా రికార్డు

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తాయిబా (ఎల్‌ఈటీ) చీఫ్‌గా కాశ్మీర్‌కు చెందిన స్థానిక ఉగ్రవాది జీనత్-ఉల్-ఇస్లాం నియమితులుకానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2017 (08:51 IST)
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తాయిబా (ఎల్‌ఈటీ) చీఫ్‌గా కాశ్మీర్‌కు చెందిన స్థానిక ఉగ్రవాది జీనత్-ఉల్-ఇస్లాం నియమితులుకానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. లష్కర్ టాప్ కమాండర్ అబు ఇస్మాయిల్ భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో ఆయన స్థానంలో జీనత్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఆయనకే కనుక ఎల్‌ఈటీ పగ్గాలు అందితే తొలి కాశ్మీరీగా రికార్డులకెక్కుతాడు.
 
సోషియాన్ ప్రాంతంలోని సుగాన్ జానిపురాకు చెందిన 28 ఏళ్ల జీనత్‌కు బాంబు (ఐఈడీలు)ల తయారీలో మంచి నైపుణ్యం ఉంది. గతంలో రెండేళ్లపాటు అల్-బద్ర్‌లో పనిచేశాడు. ఇటీవల సోషియాన్‌లో సైనికులపై జరిగిన దాడిలో జీనత్ ప్రధాన సూత్రధారి. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. కాగా, ఐదుగురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో జీనత్ కూడా ఒకడు. 
 
దీంతో జీనత్ లష్కర్ పగ్గాలు అప్పగించడం ఖాయమనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ వార్తలను కేంద్ర నిఘా వర్గాలు తోసిపుచ్చుతున్నాయి. దీనికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని కేంద్ర నిఘా వర్గాలు అంటున్నాయి. తమకు తెలిసినంత వరకు లష్కరే చీఫ్‌గా స్థానికుడెవరూ ఇప్పటివరకు లష్కరే పగ్గాలు చేపట్టలేదని పేర్కొన్నాయి. ఇక ముందు ఏం జరుగుతుందో వేచి చూద్దామని తెలిపాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments