Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్‌ నెలలో భారతీయులు ఎక్కువగా దేని గురించి మాట్లాడుకున్నారో తెలుసా?

Webdunia
గురువారం, 1 నవంబరు 2018 (11:08 IST)
అక్టోబర్‌ నెలలో భారతీయులు అధికంగా చర్చించుకున్న అంశం ఏంటో తెలుసా.. మీటూనేనట. బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా చేసిన లైంగిక ఆరోపణలతో దేశంలో ఉద్యమం ఊపందుకుంది. ఆపై దేశ వ్యాప్తంగా మీ టూ గురించి పెద్ద ఎత్తున చర్చ సాగింది. 
 
హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు దిగుమతి అయిన మీ టూ ఉద్యమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో గత నెలలో భారతీయులు ఎక్కువగా చర్చించుకున్న అంశం మీటూనేనని గ్లోబల్ మీడియా ఇంటెలిజెన్స్ సంస్థ మెల్ట్‌వేర్ పేర్కొంది.
 
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చర్చకు వచ్చిన అంశాల్లో 25 శాతం మీటూ గురించేనని తెలిపింది. అమెరికాలో 22 శాతం మంది ఈ విషయం గురించి మాట్లాడుకున్నారు. మీటూ గురించి తొలుత హాలీవుడ్‌లో చర్చకు వచ్చింది. మీటూ ఆరోపణలపై కేంద్రమంతి ఒకరు తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
 
కాగా మీ టూ గురించి అక్టోబర్ 1 నుంచి 30వ తేదీ వరకు డేటాను విశ్లేషించగా.. ఈ విషయం బయటపడినట్లు మెల్ట్‌వేర్ తెలిపింది. మీటూపై అక్టోబరులో మొత్తంగా 28,900 ఎడిటోరియల్ న్యూస్ వచ్చింది. ఇందులో 95 శాతం అక్టోబరు 10 నుంచి 18 మధ్య రావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం